telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

బాలిక హత్యాచార ఘటనలో కీలక మలుపు

Girl

పశ్చిమబెంగాల్ లో సంచలనం సృష్టించిన బాలిక హత్యాచారం సంఘటన కీలక మలుపు తిరిగింది. పోస్టుమార్టం నివేదికలో అసలు బాలిక అత్యాచారానికి గురవలేదని వైద్యులు నిర్ధారించారు. ఉత్తర దీనజ్ పూర్ జిల్లా సోనార్ పూర్ లో సమీపంలో ఓ బాలిక(16) కిడ్నాప్ అయినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.పోలీసులు గాలింపు చేపట్టగా ఇంటికి సమీపంలోని ఓ చెట్టు కింద బాలిక మృతదేహం కనిపించింది. సంఘటనా స్థలంలో ఓ విషం సీసా, స్మార్ట్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ కుమార్తెపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. విద్యార్థిని హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు రోడ్ల మీదకొచ్చి ఆందోళనలు నిర్వహించాయి. పలు చోట్ల వాహనాలకు నిప్పు పెట్టడంతో హింసాత్మక ఘటనలు జరిగాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు శనివారం ఫిరోజ్ అనే యువకుడితో తిరిగినట్లు తెలియడంతో అతడిని, అతడి తండ్రిని స్టేషన్ తీసుకువచ్చి విచారించారు. అనంతరం వాళ్ళను తిప్పి పంపారు. కాగా సోమవారం ఉదయం సోనార్ పూర్ ప్రాంతంలో ఓ చెరువు వద్ద ఫిరోజ్ మృతదేహం లభ్యమైంది. ఈ నేపథ్యంలో బాలిక హత్య పై పోస్టుమార్టం నివేదిక వెల్లడైంది. ఇందులో బాలిక అత్యాచారానికి గురవలేదని, ఒంటిపై ఎక్కడా గాయాలు కూడా లేవని, విషం తీసుకోవడం వల్లే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలిక మృతి చెందడం, ఆ తర్వాత ఆమెకి సన్నిహితంగా మెలిగిన యువకుడు శవమై తేలడం మిస్టరీగా మారింది.

Related posts