కెనడాలోని మోంట్రియల్ నుంచి వాంకూవర్ వెళ్తోందా విమానం. దానిలో కొందరు ప్రయాణికులు విమాన సిబ్బందిని పిలిచి ‘ఇక్కడేదో ఇబ్బందికరమైన కంపు కొడుతోంది..’ అంటూ ఫిర్యాదులు చేశారు. దాంతో పరిసరాలను పరిశీలించిన సిబ్బంది.. నిజంగానే దుర్గంధం వస్తుండటంతో షాకయ్యారు. ఆ వాసన ఎందుకు వస్తుందా అని ఆరాతీయగా.. విమానం కార్గోలో ఉన్న డ్యూరియన్ పండు వల్లే ఆ కంపు వస్తోందని తేలింది. విషయం తెలుసుకున్న పైలట్.. విమానాన్ని వెనక్కి మళ్లించి మోంట్రియల్లో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఆ పండు తీసేసిన తర్వాతే విమానం బయలుదేరింది. ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా పండే ఈ డ్యూరియన్ పండును.. ‘కింగ్ ఆఫ్ ఫ్రూట్స్’ అంటారు. ఎంతో రుచిగా ఉన్నాసరే దీని కంపును భరించడం మాత్రం కష్టమని ఆహారప్రియులు చెప్తారు. అందుకే చాలా ఆసియాదేశాల్లోని రెస్టారెంట్లు ఈ పండు వినియోగంపై నిషేధం విధించాయి కూడా.
previous post
స్నేక్ బాబు ఎక్కడ… ? అన్నపూర్ణ స్టూడియో గేటు దగ్గర… నాగబాబుపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు