రామ్ చరణ్ సోషల్ మీడియాలో సరికొత్త మైలు రాయిని అందుకున్నారు. సోషల్ మీడియా లో చెర్రీని ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగానే ఉంది. ఇప్పుడు ఆ సంఖ్య అక్షరాలా 2 మిలియన్లకు చేరింది. గతేడాది జూలైలో చరణ్ ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇన్స్టాలో తనను ఫాలో అయ్యే వారి సంఖ్య 2 మిలియన్స్కు చేరుకుంది. ఇన్స్టాతో పాటు చెర్రీ ట్విట్టర్, ఫేస్బుక్లోనూ యాక్టివ్గా ఉంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్తో కలిసి రామ్చరణ్ నటిస్తోన్న ‘రౌద్రం రణం రుధిరం’. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన రామ్చరణ్ బర్త్డే వీడియో ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. 2021 జనవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నల్లమలను నాశనం చేయొద్దు… కేటీఆర్ కు శేఖర్ కమ్ముల పోస్ట్