దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవరస్టార్ రామ్చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయస్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నికల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్రమిది. అలియా భట్, సముద్ర ఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ పాత్రలో, రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో చరణ్ గాయపడడంతో కొద్ది రోజుల పాటు షూటింగ్కి బ్రేక్ ఇచ్చారు. మూడు వారాల తర్వాత ఆయన పూర్తిగా కోలుకోవడంతో మళ్ళీ షూటింగ్ ప్రారంభించారు. అయితే తాజాగా ఆయన మరోసారి గాయపడ్డాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆరాలు తీసారు. ఈ నేపథ్యంలో పీఆర్ఓ వంశీ కాక తన ట్విట్టర్ ద్వారా పుకార్లకి పులిస్టాప్ పెట్టారు. “రామ్ చరణ్ గాయపడ్డాడంటూ వస్తున్న వార్తలలో వాస్తవం లేదు. ఆయన ఎంతో సురక్షితంగా ఉన్నారు. నిన్న, ఈ రోజు షూటింగ్లో కూడా పాల్గొన్నారు” అని పేర్కొన్నారు. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ అనంతరం చిత్ర యూనిట్ పుణే వెళ్లనున్నట్లు సమాచారం.
పొట్టి బట్టలు వేసుకున్నందుకు ట్రోల్ చేశారు : అవికా గోర్