సూపర్స్టార్ రజనీకాంత్ను ఆయన మనవడు వేద్ అనుకరిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. రజనీని వేద్ ఇమిటేట్ చేస్తున్న ఫోటోను సౌందర్య ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. సౌందర్య ఈ ఫొటోకు “తాతలాగే మనవడు” అనే క్యాప్షన్ను ఇచ్చారు. ఈ క్యాప్షన్ ను చూసిన సూపర్ స్టార్ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మేడమ్ రజనీకాంత్ను తాత అనకండి అని సౌందర్యకు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం “దర్బార్”. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. నయనతార, నివేదా థామస్, దలీప్ తాహిల్, ప్రతీక్ బబ్బర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్గా కనిపించబోతున్నాడట. వచ్చే ఏడాది సంక్రాంతికి “దర్భార్” చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
previous post
next post
కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా… వర్మకు ప్రముఖ నిర్మాత కౌంటర్