telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : బట్లర్ హాఫ్ సెంచరీతో విజయం సాధించిన రాయల్స్…

ఐపీఎల్ 2020 లో ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య అబుదాబి వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన చెన్నై మొదట బ్యాటింగ్ చేసింది. అయితే జట్టు టాప్ ఆర్డర్ మొత్తం విఫలం కావడంతో చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. ఇక 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన రాజస్థాన్ ను చెన్నై బౌలర్లు మొదట కంగారు పెట్టారు. పవర్ ప్లే లోనే మూడు వికెట్లు తీశారు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన బట్లర్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తో కలిసి జట్టును విజయం వైపుకు నడిపాడు. స్మిత్ కేవలం స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉంటె బట్లర్ సమయం దొరికినప్పుడలా బౌండరీలు బాదుతూ 48 బంతుల్లో 70 పరుగులు చేయడంతో మరో వికెట్ పడకుండా 17.3 ఓవర్లలోనే రాయల్స్ ఈ ఏడాది ఐపీఎల్ లో నాలుగో విజయం సాధించింది. ఇక చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, రెండు వికెట్లు తీయగా జోష్ హాజిల్వుడ్ ఒక వికెట్ సాధించాడు. ఇక ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో చివరికి స్థానానికి చెన్నై చేరుకోగా విజయంతో రాయల్స్ 5వ స్థానానికి వచ్చింది. దీంతో ఐపీఎల్ 2020 లో 7 మ్యాచ్ లు ఓడిపోయిన చెన్నై ప్లే ఆఫ్ కి చేరుకోవడం దాదాపు అసాధ్యం.

Related posts