telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడుతున్నా..డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆవేదన

pushpa sreevani

ఇంగ్లీష్ రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. బూసరాజుపల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన ‘మన బడి నాడు-నేడు’ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన తాను… ఇంగ్లీష్ మీడియంలో మూడు నెలలు ఇంటర్ చదివానని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ తెలుగు మీడియంలో చేరాననితెలిపారు.

డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పటికీ ఆ భాషపై పట్టు సాధించలేకపోయానని తెలిపారు. ఇంగ్లీష్ రాకపోవడంతో ఇప్పుడెంతో ఇబ్బంది పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి విద్యార్థులకు అలాంటి ఇబ్బంది రాకూడదనే, ఇంగ్లీష్ మీడియంను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

Related posts