విద్యాసంవత్సరం ప్రారంభమైందంటే విద్యార్థులను చదివించే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ఇష్టానుసారంగా ఫీజులు వసూల్ చేస్తూ ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు అడ్డగోలు నిబంధనలు పెడుతుంటారు. యూనిఫాంలు, పుస్తకాలు, ఆ ఫీజు, ఈ ఫీజు అంటూ ముక్కుపిండి వసూలు చేస్తారు. దీనికితోడు యూనిఫాంలు, పుస్తకాలు తమ దగ్గరే కొనాలని చాలా పాఠశాలలు నిబంధనలు పెడుతుంటాయి. తాజాగా అలాంటి ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేలా పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పాఠశాల ప్రాంగణంలో యూనిఫాంలు, పుస్తకాలు, టెక్ట్స్ బుక్కుల అమ్మకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.సీబీఎస్ఈ ప్రైవేటు స్కూళ్లు, ఐసీఎస్ ఈ పాఠశాలలు, పంజాబ్ స్కూలు ఎడ్యుకేషన్ బోర్డు పరిధిలోని పాఠశాలలు అన్నింటికి ఈ నిబంధనలు వర్తిస్తాయని పంజాబ్ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్లా తెలిపారు. తమ షాపులోనే పుస్తకాలు, యూనిఫాంలు కొనాలని పాఠశాలలు తల్లిదండ్రులపై ఒత్తిడి చేయరాదని స్పష్టం చేశారు. ఓసారి పాఠశాలల యూనిఫాంను ఎంపిక చేస్తే రాబోయే మూడేళ్లు అదే దుస్తులను వాడాలనీ, ఏటా యూనిఫాం రంగులు, డిజైన్లు మార్చడం కుదరదని స్పష్టం చేశారు.
ప్రతి అవ్వ ముఖంలో సంతోషం కనిపిస్తుంది: హరీష్ రావ్