telugu navyamedia
రాజకీయ

నాన్న‌ను మిస్ అవుతున్నాను-రాహుల్ ఎమోష‌న‌ల్ ట్వీట్

నేడు భార‌త‌దేశ మాజీ ప్ర‌ధాని రాజీవ్‌గాంధీ 31వ వ‌ర్థంతి. 1991, మే 21వ తేదీన జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో దుర్మరణం పాలయ్యారు ఆయన. అప్పటికి ఆయన వయసు 46 సంవత్సరాలు.

ఈ సంద‌ర్భంగా దేశ రాజ‌ధాని ఢిల్లీలోని వీర‌భూమిలో కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంక‌గాంధీ నివాళులు అర్పించారు.

రాజీవ్‌ వ‌ర్థంతి సంద‌ర్భంగా రాహుల్ ఎమోష‌న‌ల్ ట్వీట్ పోస్ట్ చేశారు..మా నాన్న దూరదృష్టి గల నాయకుడు, అతని విధానాలు ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో సహాయపడ్డాయి.

అతను కరుణ మరియు దయగల వ్యక్తి అని రాహుల్ అన్నారు. నాకు, ప్రియాంకకు అద్భుతమైన తండ్రి, క్షమాపణ , సానుభూతి యొక్క విలువను మాకు నేర్పించారని గుర్తు చేసుకున్నారు.

నేను అతనిని చాలా మిస్ అవుతున్నాను ..అలాగే మేము నాన్న‌తో
గ‌డిపిన సమయాన్ని ప్రేమగా గుర్తుంచుకుంటాను అని తెలిపారు.

Related posts