విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన గురువులే అనుచితంగా ప్రవర్తించిన ఘటన గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సమాజం తలదించుకునే సంఘటన చింతలపూడి మండలంలో జరిగింది. ప్రైమరీ స్కూలు విద్యార్థులతో ఉమామహేశ్వర రావు, రాజశేఖర్ అనే ఇద్దరు ఉపాధ్యాయులు డెమోరేప్ నిర్వహించేందుకు యత్నించారు. అత్యాచారం ఎలా చేస్తారో చూపించాలంటూ తరగతి గదిలోని విద్యార్థులపై ఒత్తిడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ బాలికకు గాయాలయ్యాయి.
ఈ విషయం బయటికి పొక్కడంతో గ్రామస్తులు ఇద్దరు ఉపాధ్యాయులకు దేహశుద్ధి చేశారు. ఈ విషయం పోలీసుల వరకు వెళితే తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని గ్రహించిన ఆ టీచర్లు గ్రామస్తులకు చెరో రూ.80 వేలు ఇచ్చి రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన డీఈఓ వద్దకు చేరడంతో శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది