telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆ వార్తలన్నీ వదంతులే: కిరణ్ బేడీ

Puducheri Governor Kiranbedi Comments AP

ఏపీ గవర్నర్‌గా నియమిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడీ స్పందించారు.  తట్టాంచావడిలోని ఆది ద్రావిడర్‌ సంక్షేమశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గవర్నర్‌ గా వెళ్లనున్నట్టు వచ్చిన వార్తలు వదంతులేనని స్పష్టం చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎంపీగా బరిలోకి దిగుతానన్నది కూడా అవాస్తవమేనని చెప్పారు.

ఎన్నికల్లోనూ పోటీ చేయాలని తాను భావించడం లేదని, పరిపాలనా వ్యవహారాల్లో కొనసాగాలనే కోరుకుంటున్నానని కిరణ్ బేడీ తెలిపారు. గవర్నర్ నరసింహన్ పదవీ కాలం ఎప్పుడో ముగిసినప్పటికీ కేంద్రం ఆయన్నే కొనసాగిస్తూ వచ్చింది. నరసింహన్ ను తెలంగాణకు మాత్రమే పరిమితం చేసి, ఏపీ గవర్నర్‌గా కిరణ్‌ బేడీని నియమిస్తారని ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

Related posts