telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఈ తాత వల్ల పసివాడి బర్త్ డేను డెత్ డే అయ్యింది

Baby

మనవడి పుట్టినరోజు వేడుకలో తాత చేసిన ఓ పిచ్చి పని నెలలు కూడా నిండని పసివాడి ప్రాణాలు తీసిన ఘటన చైనాలో జరిగింది. పెళ్లైన మూడేళ్లకు పుట్టిన బిడ్డ కావడంతో ఆ పేరెంట్స్ ఫస్ట్ మంత్ బర్త్‌డే పార్టీ చేయడానికి నిర్ణయించడం, అది కాస్తా పసివాడి ప్రాణాలు తీయడంతో విషాదాన్ని మిగిల్చింది. బర్త్ డే పార్టీకి వచ్చిన ఓ అతిథి సరదాగా బాలుడి తాతతో బర్త్‌డే బాయ్ తాగనిదే ఈ వేడుక ఎలా పరిపూర్ణం అవుతుందని అన్నాడు. అంతే.. అతడి మాటలను సీరియస్‌గా తీసుకున్న తాత వెంటనే చిన్న గ్లాసులో మద్యం పోసి నెల వయసు గల పసివాడి నోటిలో పోశాడు. మందు పోసిన అర్థగంట తరువాత బాలుడు తీవ్ర అనారోగ్యంతో శ్వాసతీసుకోవడం ఆపేశాడు. దాంతో హుటాహూటిన చికిత్స కోసం పసివాణ్ణి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాబును బతికించేందుకు గంటకుపైగా శ్రమించిన ఫలితం లేకుండా పోయింది. ఆల్కహాల్ అలెర్జీ వల్ల బాలుడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. చిన్నపిల్లలు మద్యం తాగడం వల్ల రక్తంలో షూగర్ లెవల్స్ పడిపోయి అనారోగ్యానికి గురికావడంతో పాటు కోమాలోకి వెళ్లిపోతారని వైద్యులు తెలిపారు. మెదడుకు కావాల్సినంత గ్లుకోజ్ అందకపోవడంతో ఇలా జరగుతుందని, కొన్నిసార్లు షూగర్ లెవల్స్ పడిపోవడం ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుందని వైద్యులు చెప్పుకొచ్చారు.

Related posts