రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ను ఆహ్వానించడానికి సీఎం కేసీఆర్ శుక్రవారం ముంబై వెళ్లనున్నారు.
ఉదయం 10.20 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి ముంబై వెళ్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ను కలుస్తారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఫడణవీస్ను కేసీఆర్ ఆహ్వానిస్తారు.