telugu navyamedia
రాజకీయ వార్తలు

జమ్మూ కశ్మీర్‌లో మొబైల్ ఫోన్ లు పనిచేస్తున్నాయి!

18 soldier died in jammu kashmir bomb blast

జమ్మూ కశ్మీర్‌ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్‌లో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. క్రమంగా పరిస్థితి అందుబాటులోకి వచ్చిన దృష్ట్యా ఆంక్షలను ఎత్తివేసినట్టు సమాచార, పౌర సంబంధాల అధికారులు ప్రకటించారు. ఫోన్ ల్యాండ్‌లైన్లను పూర్తి వినియోగంలోకి తెచ్చినట్టు వెల్లడించారు. కుప్వారా, హంద్వారాలో కూడా మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు గణనీయంగా అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు.

ట్రాఫిక్ రద్దీ కూడా క్రమంగా పెరుగుతోంది. ల్యాండ్ లైన్లు పూర్తిగా పనిచేస్తున్నాయి. కుప్వారా, హంద్వారా ప్రాంతాల్లో కూడా మొబైల్ ఫోన్ల వినియోగం గణనీయంగా అందుబాటులో వచ్చిందిని అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంతత నెలకొంటే క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తామంటూ ఇటీవల జాతీయ భద్రదా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించిన విషయం విధితమే.

Related posts