భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొండుతున్న విషయం తెలిసిందే. కరోనాతో పాటు మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ జరిగింది. ఆ తర్వాత నుంచి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆయన బాధపడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందుతోంది.
ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి ఈ రోజు బులిటెన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని అందులో వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని వారు వివరించారు. అలాగే, ఇప్పటికీ ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.