telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వెంటిలేటర్‌పైనే ప్రణబ్.. ఆర్మీ ఆసుపత్రి బులిటెన్

Pranabh mukarji

 భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొండుతున్న విషయం తెలిసిందే. కరోనాతో పాటు మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ జరిగింది. ఆ తర్వాత నుంచి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందుతోంది.

ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి ఈ రోజు బులిటెన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని అందులో‌ వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని వారు వివరించారు. అలాగే, ఇప్పటికీ ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

Related posts