ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 350 కోట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఊహించని కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 424 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అన్ని ఏరియాల నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్తో సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించింది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా ‘సాహో’ రూపొందింది. హాలీవుడ్ సినిమాల స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్, స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేశారు. ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను గ్రాండ్గా నిర్మించారు.
next post
సైనా నువ్వు ఈ ఆట ఎలా ఆడుతున్నావు ? : పరిణితి చోప్రా