ఉమ్మడి ఏపీ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని 15న రాష్ట్రమంతటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం ఆదేశాలు జారీచేసింది.
డిసెంబరు 15 ఆదివారం సెలవురోజు కావడంతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ముందస్తుగా ఆదేశాలు జారీ చేసింది.
90 శాతం సర్పంచ్ స్థానాల్లో వైసీపీ మద్దతు దారుల విజయం ఖాయం…