telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నెల్లూరు మేయర్ గా స్రవంతి..

ప్రజలకు అందుబాటులో ఉండి సహచర కార్పొరేటర్లను సమన్వయంతో విశ్వాసాన్ని పెంపొందించేవిధంగా సేవలు అందిస్తామని నెల్లూరు కార్పొరేషన్ మేయర్ స్రవంతి అన్నారు. నెల్లూరు నగరాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు అధికారయంత్రాంగం సహకరించాలని కోరారు.

నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కొత్త మేయర్ గా స్రవంతి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయం చేరుకున్న స్రవంతిని కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించారు. సహచర కార్పొరేటర్లు పుష్పగుచ్ఛాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ లోనూ యాభైశాతం మంది మహిళలు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించారన్నారు. నెల్లూరు మేయర్ గా ఎంపికచేయడానికి సంపూర్ణంగా సహకరించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆశీర్వదించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలకు కృత‌జ్ఞత‌లు తెలిపారు.

Related posts