telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అందుకే వైసీపీ నేతలు అమరావతిపై బురద చల్లుతున్నారు…

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… చంద్రబాబు మీద రాజకీయ కక్షతోనే సీఐడీ నోటీసులు ఇచ్చారని, అమరావతి రాజధానిని అల్లరి చేయాలని ఇలా చేస్తున్నారని ఆయన అన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రతిపక్షం లో ఉన్నప్పటి నుంచి ప్రచారం చేస్తున్నారని, జగన్ ముఖ్యమంత్రి అయిన దాదాపు 20 నెలలు అవుతుంది మరి ఎందుకు నిరూపించలేదు ? అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి నారాయణ అసైన్డ్ ల్యాండ్ ను బదాలయించారని ఆరోపిస్తున్నారని, చంద్రబాబు, నారాయణకు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెబుతున్నారని మరి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అమరావతికి మద్దతు ఇచ్చిన సంగతి మర్చిపోయారా ? అని ప్రశ్నించారు. విశాఖలో రాజధాని కావాలని వైసీపీ నేతలు అమరావతిపై బురద చల్లుతున్నారని ఒక రకంగా ఏపీలో తమిళనాడు సంస్కృతి వస్తుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని అన్నారు.

Related posts