telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పేపర్ లీక్ కథనాల పై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి

AP-Grama-Sachivalayam

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల పరీక్ష పేపర్లు ముందే లీకయ్యాయంటూ వస్తున్న కథనాల పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ప్రశ్నాపత్రాలు బయటికి వచ్చే అవకాశమే లేదన్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే పేపర్ లీక్ అని, స్కాం అని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్షలను పూర్తిగా పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించామని చెప్పారు. ఈ పరీక్ష ఫలితాలు నిన్న విడుదల కాగా, పేపర్ లీక్ అని, ఉద్యోగాలను అమ్ముకున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. వాటిపై టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ లో ఘాటుగా స్పందించారు.

Related posts