telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సాయికుమార్ ‘పోలీస్ స్టోరీ’ కి సీక్వెల్…

సాయికుమార్ హీరోగా రూపొందిన ‘పోలీస్ స్టోరీ’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. అదే టీమ్ తో… దాదాపు 25 ఏళ్ళ తర్వాత పోలీస్ స్టోరీ టీమ్ తోనే ఇప్పుడు ఈ సీక్వెల్ కి శ్రీకారం చుట్టబోతుండటం విశేషం. వచ్చే జనవరి 26న ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందట. థ్రిల్లర్ మంజు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని గురురామ ఫిల్మ్ మేకర్స్ పతాకంపై గురుమూర్తి, నరసింహమూర్తి నిర్మించనున్నారు.
నాలుగో సింహం… ఈ సీక్వెల్ కు ‘ఫోర్త్ లయన్’ అనే టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం. అంటే నాలుగోసింహం అన్నమాట. పోలీస్ స్టోరీని 1996 ఆగస్ట్ 16న విడుదల చేస్తే ఈ సినిమా 2021 ఆగస్ట్ 14న స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా విడుదల చేయబోతుండటం గమనార్హం. 25 ఏళ్ళ తర్వాత ఓ సినిమాకు సీక్వెల్ రూపొందనుండటం… అదీ అదే టీమ్ తో తెరకెక్కటం అనేది వండర్ గానే చెప్పవచ్చు. మరి ఈ సీక్వెల్ తో సాయికుమార్ కి అప్పటి పోలీస్ ఇమేజ్ మళ్ళీ తిరిగి వస్తుందేమో చూడాలి.

Related posts