ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ నాయకులు అడ్డంగా దొరికిపోతున్నారు. ఏకంగా మీడియా ముందే సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. అందరి దృష్టిలో టార్గెట్ అవుతున్నారు. తాజాగా.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందరికీ రావని…కట్టే ఇళ్లు చాలా తక్కువని… అవి కూడా లాటరీలో కేటాయిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. దేవుని దయ ఉంటే లాటరీలో ఇల్లు వస్తుందని… ఏ ప్రభుత్వం కూడా లక్షల్లో ఇళ్లు కట్టి ఇవ్వలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏటా కొన్ని ఇళ్లు కడుతూనే ఉంటుందని.. దేవుని దయ ఉంటే ఎప్పుడోసారి ఇల్లు వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కాగా.. ఇవాళ హైదరాబాద్ లోని వనస్థలిపురం రైతుబజార్ పక్కన నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులు పాల్గొన్నారు.
previous post
next post