telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఛత్తీస్‌ఘడ్ లో భారీ ఎంకౌంటర్.. 10 మంది మావోల మృతి

Maoists
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలంలో భారీగా మందుగుండు సామాగ్రితో పాటు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  బీజాపూర్ జిల్లాలోని బైరాంఘడ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోంది. పోలీసులకు, మావోలకు మధ్య  జరిగిన ఎదురు కాల్పుల్లో పది మంది మావోయిస్టులను కాల్చిచంపాయి.
ఈ విషయమై జిల్లా ఎస్పీ మోహిత్ గార్గ్ మాట్లాడుతూ.. బైరాన్ ఘడ్ ప్రాంతంలో ఈరోజు ఎస్టీఎఫ్, డీఆర్జీ సంయుక్త బలగాలు కూంబింగ్ చేపట్టాయని తెలిపారు. ఇంతలోనే మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాల తరఫున ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు. ఘటనాస్థలం నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపును ముమ్మరం చేశామన్నారు.

Related posts