రుణ గ్రహీతలకు గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రుణ గ్రహీతలకు పలు ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ను ప్రకటించింది. పీఎన్బీ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్లో భాగంగా కస్టమర్లు ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేసింది. అంతేకాకుండా డాక్యుమెంటేషన్ చార్జీలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. హౌసింగ్ లోన్, కార్ లోన్ వంటి వాటికి ఈ బెనిఫిట్స్ లభిస్తాయి. రుణ గ్రహీతలకు ఈ ప్రయోజనాలు డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయని బ్యాంక్ తెలిపింది. రుణం తీసుకోవాలని భావించే వారు దేశవ్యాప్తంగా ఉన్న 10,897 బ్రాంచులకు వెళ్లి అక్కడి అధికారులను సంప్రదిస్తే సరితుంది. లోన్ ఆఫర్లు మీకు తెలియజేస్తారు. హోమ్ లోన్పై కస్టమర్లు రుణ మొత్తంలో 0.35 శాతం (రూ.15,000 వరకు) ప్రాసెసింగ్ ఫీజు చెల్లించక్కర్లేదు. కార్ లోన్స్ విషయానికి వస్తే ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం నుంచి మినహాయింపు లభిస్తోంది. ఇకపోతే హోమ్ లోన్స్పై వడ్డీ రేటు 7.1 శాతం నుంచి ప్రారంభమౌతోంది. కార్ లోన్స్పై వడ్డీ రేటు 7.55 శాతం నుంచి ఆరంభమౌతుంది. ఇక కోవిడ్ 19 కారణంగా తగ్గిన లోన్ డిమాండ్ను పెంచుకోవాలనే లక్ష్యంతో బ్యాంక్ ఈ ఆఫర్లు తీసుకువచ్చింది.
previous post