‘బాహుబలి’ భారీ విజయం తర్వాత.. ‘ఆర్.ఆర్.ఆర్’తో బిజీ అయ్యాడు జక్కన్న. ‘బాహుబలి’ సిరీస్కి ఏమాత్రం తీసిపోని రీతిలో ‘ట్రిపుల్ ఆర్’ తెరకెక్కుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఎన్టీఆర్-రామ్ చరణ్ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’.. వచ్చే యేడాది సంక్రాంతి బరిలో విడుదలకు ముస్తాబవుతుంది. ఈ క్రేజీ మల్టీస్టారర్ తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నాడు? ఎవరితో చేయబోతున్నాడు? అనే చర్చ కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది. అయితే.. లేటెస్ట్గా రాజమౌళి నెక్స్ట్ మూవీపై ఓ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. తన తదుపరి సినిమాగా ‘ఆర్.ఆర్.ఆర్’కి మించిన మరో మల్టీస్టారర్ రూపొందించేందుకు కసరత్తులు మొదలుపెట్టాడట జక్కన్న. నిజానికి మహేశ్బాబుతో రాజమౌళి సినిమా చేయాల్సి ఉంది. కె.ఎల్.నారాయణ ఆ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అయితే మహేశ్ బాబుతో పాటు తన తర్వాతి సినిమా కోసం ప్రభాస్ని కూడా లైన్లో పెడుతున్నాడట. ‘ఆర్.ఆర్.ఆర్’కి మించిన రీతిలో మహేశ్-ప్రభాస్తో భారీ మల్టీస్టారర్కి ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. ‘బాహుబలి’, ‘ఆర్.ఆర్.ఆర్’ తరహాలో పీరియాడికల్ వార్ డ్రామాగా ఉంటుందట. కె.ఎల్.నారాయణతో పాటు యు.వి.క్రియేషన్స్ కూడా ఆ ప్రాజెక్టుకి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు టాక్. మరి ఇందులో నిజమెంతుందో చూడాలి.
next post
ఛార్మి నా స్టూడెంటే కాని.. నన్ను పిచ్చోడిలా చూసింది.. : రాకేష్ మాస్టర్