telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మళ్ళీ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ రిపీట్

Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు… త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ఈ రోజు స్వయంగా ప్రకటించారు. సరిగ్గా పదేళ్ల క్రితం వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఖలేజా’ సినిమా వచ్చింది. ఈ రోజుతో ‘ఖలేజా’ వచ్చి పదేళ్లయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మహేష్ సోషల్ మీడియాలో స్పందిస్తూ “ఖలేజా వచ్చి పదేళ్లయింది. అందులో నాకు నేను ఆర్టిస్టుగా కొత్తగా కనిపించాను. ఆ సినిమా నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుంది. నా మంచి మిత్రుడు, బ్రిలియంట్ అయిన త్రివిక్రమ్ కి ఎన్నో కృతజ్ఞతలు. మా తదుపరి చిత్రం కోసం ఎదురు చూస్తున్నాను. అది త్వరలోనే ” అంటూ పోస్ట్ చేశారు. దీనిని బట్టి వీరిద్దరి కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా రానుందని అర్థమవుతుంది. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ అమెరికాలో ప్రారంభం అవుతుంది. మరోపక్క త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయనున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ సినిమా సెట్స్ కి వెళ్ళే అవకాశం ఉంది.

Related posts