దేశంలో తెలుగు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో మూడురోజుల పాటు.. తమ కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్నారు. వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, గాలి పటాలు, భోగి మంటల వద్ద చిన్నారులు కోలాటలతో ఆడిపాడారు. హరిదాసుల కీర్తనలతో సందడి వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ తెలుగు భాషలో భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనంద స్ఫూర్తిని పెంపొందించాలి. ప్రజలందరికీ మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను’ అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు.
Bhogi greetings to everyone. May this special festival enrich the spirit of happiness in our society. I pray for the good health and well-being of our fellow citizens. pic.twitter.com/plBUW3psnB
— Narendra Modi (@narendramodi) January 14, 2022
అలాగే భోగి పండుగ సందర్భంగా సకల జనులకు ఆ భగవంతుడు భోగభాగ్యాలు, సుఖసంతోషాలు కలిగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చెన్నై కోట్టూర్ పురంలోని స్వగృహం వద్ద వెంకయ్యనాయుడు దంపతులు భోగిమంటలు వేశారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు.ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లోకి నూతన కాంతులను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.”