telugu navyamedia
రాజకీయ

దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ భోగి శుభాకాంక్ష‌లు..

దేశంలో తెలుగు జ‌రుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ అత్యంత‌ భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో మూడురోజుల పాటు.. తమ కుటుంబ సభ్యులతో జ‌రుపుకుంటున్నారు. వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, గాలి ప‌టాలు,  భోగి మంటల వద్ద చిన్నారులు కోలాటలతో ఆడిపాడారు. హరిదాసుల కీర్తనలతో సందడి వాతావరణం నెలకొంది. 

ఈ సంద‌ర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ తెలుగు భాష‌లో భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనంద స్ఫూర్తిని పెంపొందించాలి. ప్రజలందరికీ మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను’ అంటూ ఆయన ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు.

 

అలాగే భోగి పండుగ సందర్భంగా సకల జనులకు ఆ భగవంతుడు భోగభాగ్యాలు, సుఖసంతోషాలు కలిగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చెన్నై కోట్టూర్ పురంలోని స్వగృహం వద్ద వెంకయ్యనాయుడు దంపతులు భోగిమంటలు వేశారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు.ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లోకి నూతన కాంతులను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.”

Related posts