telugu navyamedia
రాజకీయ

జగన్ బెయిల్ రద్దుచేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అక్రమాస్తుల కేసులో సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశానని చెప్పారు. న్యాయం కోసం, ధర్మం కోసం చివరి వరకు పోరాడుతానని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. జగన్ బెయిల్ రద్దుచేయాలంటూ గతంలో సీబీఐ కోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. సీబీఐ కోర్టులో 3 నెలలపాటు దీనిపై విచారణ జరిగింది.

జగన్ బెయిల్ సందర్భంగా కోర్టు విధించిన షరతులను జగన్, విజయసాయిరెడ్డి ఉల్లంఘించారని అందువల్ల వారి బెయిల్ రద్దుచేయాలని రఘురామకృష్ణ తరపున లాయర్లు వాదనలు వినిపించారు. తాము ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని, రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామరాజు పిటిషన్ వేశారంటూ జగన్ తరపున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న సీబీఐ న్యాయస్థానం రఘురామరాజు పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో రఘురామరాజు మరో పిటిషన్ దాఖలు చేశారు.

Related posts