telugu navyamedia
రాజకీయ వార్తలు

అవినీతి కేసుల్లో అజిత్ పవార్ కు ఊరట

ajit-pawar- ncp

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు అవినీతి కేసుల్లో ఊరట లభించింది. తొమ్మిది అవినీతి కేసుల్లో ఆయనకు క్లీన్ చిట్ లభించింది. నీటిపారుదల ప్రాజెక్టులో 70 వేల కోట్ల అవినీతి జరిగిందన్న కేసును కూడా మూసేశారు. ఈ సందర్భంగా ఏసీబీకి చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, అజిత్ పవార్ పై ఎలాంటి అవినీతీ కేసులు లేవని తెలిపారు. మరోవైపు, ఈ కేసుల్లో అజిత్ పవార్ కు క్లీన్ చిట్ రావడంపై శివసేన, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. ఇదంతా క్విడ్ ప్రోకోలో భాగమేనని ఆరోపించాయి. కేసులను దృష్టిలో ఉంచుకునే బీజేపీకి అజిత్ పవార్ మద్దతిచ్చారని విమర్శించాయి.

Related posts