telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వారు పక్క జిల్లాల నుండి మనుషులను తెచ్చుకుంటున్నారు..

harish rao trs

రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కేంద్ర బిల్లులకి వ్యతిరేకంగా త్వరలో ఉద్యమం చేస్తుంది అని మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళకి పరాయి లీడర్లు, కిరాయి మనుషులు. వాళ్ళు పక్క జిల్లాల నుండి మనుషులను తెచ్చుకుంటున్నారు అని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఉండగా తిన్నది అరగక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని బీజేపీ వాళ్ళు అన్నారు. వ్యవసాయం దండగా అని కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బండారు దత్తాత్రేయ అన్నారు అని తెలిపారు. మీకు కాలిపోయే మోటారులు కావాలా, బావి దగ్గర మీటర్లు కావాలా, 24 గంటలు కరెంట్ కావాలా అని ప్రజలను అడిగారు. 27ఏప్రిల్ 2020 నాడు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక  బిల్లు తెచ్చింది.17 మే సబ్సిడీ లేకుండా బిల్లు ఇవ్వాలి అని కేంద్రం  రాష్ట్రానికి లెటర్ రాసింది. బావిల దగ్గర మీటర్లు పెడితే 2500 కోట్లు ఇస్తామన్నారు. కానీ జూన్ 2 మీటర్లు పెట్టము అని సీఎం కేంద్రానికి లెటర్ రాశారు. మీటర్లు వద్దు అంటే 300 మీటర్ల లోత లో బీజేపీని పాతి పెట్టాలి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో పంట ఎండకుండా ఎప్పుడు అయిన పండిందా అని ప్రశ్నించిన ఆయన ముత్యం రెడ్డి ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు 30 వేలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ లు ఇచ్చేవారు అన్నారు. అలాగే విదేశీ మక్కలు తెస్తే ఇక్కడి మక్కలు ఎవరు కొంటారు. ఎవరి ప్రయోజనాలు కోసం బీజేపీ ఈ పని చేస్తుంది అబద్ధాల పునాదిల మీద బీజేపీ , కాంగ్రెస్ లు ఓట్లు పొందాలని చూస్తున్నాయి అని తెలిపారు.

Related posts