telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్.. లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువు పొడగింపు

Pension

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పెన్షన్‌ దారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్‌ చివరిలోగా సమర్పించాల్సిన లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువును ఈ ఏడాది చివరి వరకూ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

80 ఏళ్లు దాటినవారు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి డిసెంబర్‌ 31వ తేదీలోగా లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించవచ్చని పేర్కొన్నారు. అప్పటి వరకు వారి పెన్షన్‌ పంపిణీకి ఎలాంటి ఢోకా ఉండ‌బోద‌ని భరోసా ఇచ్చారు. వృద్ధుల‌కు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న కార‌ణంగా, లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువును పొడిగిస్తున్నట్టు కేంద్రం తన ప్రకటనలో తెలిపింది.

Related posts