telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆస్పత్రుల్లో పడకలు కరువయ్యాయి: ఉత్తమ్

uttam congress mp

కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరోనా విస్పోటనంపై ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. సలహాలు ఇస్తున్న ప్రతిపక్షాలను తిట్టిపోస్తున్నారని ధ్వజమెత్తారు. లాక్‌డౌన్ సమయంలో వైద్య సదుపాయాలు సమకూర్చుకోలేక పోయారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు కరువయ్యాయని ఉత్తమ్ అన్నారు. పరిస్థితి మెరుగుపడాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలని ఉత్తమ్ సూచించారు. గాంధీ ఆస్పత్రిలో అసౌకర్యాలపై బాధితులు వీడియోలు పెడితే వారి పట్ల మంత్రి ఈటల రాజేందర్ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.

Related posts