జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు పర్యటనలో భాగంగా వైజాగ్ చేరుకున్నారు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరసనకారుల శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించింది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయకుండా ఉండాలని విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పోరాటం చేస్తోంది. విశాఖ ఉక్కు ..ఆంద్రుల హక్కు అని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు పవన్ మద్దతు తెలిపారు.