టాలీవుడ్ హీరోలు మల్టీ టాలెంటెడ్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగు హీరోలు కేవలం నటించడమే కాకుండా సింగింగ్, డైరెక్షన్, రైటింగ్లో కూడా అందరిని మెప్పించగలరు. తమ స్టైల్కు తగ్గట్టుగా సినిమా స్క్రేన్ప్లే రాసుకోగల స్టార్లు కూడా ఉన్నారు. అలాంటి వారి కోవలో పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ కూడా ఉంటాడు. పవన్ ఏ సినిమా చేసినా తన మార్క్ ఉంటుంది. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా కూడా తన పాత్రను అందరూ మెచ్చుకునేలా పవన్ ప్రజెంట్ చేస్తాడు. అంతేకాకుండా సినిమాకు తనకు నచ్చిన పాయంట్స్ కూడా చెప్తాడు. అయితే చాలా కాలం తర్వాత పవన్ మళ్లీ తనలోని రచయితను బయటకు తీసుకురానున్నాడు. ప్రవన్ తాజాగా చేస్తున్నా సినిమా అయ్యప్పన్ కోషియుమ్. ఈ సినిమాలో పవన్, రానా కలిసి కనిపించనున్నారు. దీనిని సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శక పర్యవేక్షకుడిగా వ్యవహరించనున్నాడు. అయితే ఈ సినిమా స్క్రీన్ప్లే విషయంలో పవన్ తన కలానికి ఉన్న పవర్ను చూపించనున్నాడు. దీనికి త్రివిక్రమ్ కూడా పచ్చజెండా ఊపడంతో వాటిన సాగర్ తనదైన రీతిలో తెరకెక్కించనున్నాడట. మరి రచయితల టైటిల్ కార్డుల్లో పవన్ పేరు వస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాపై పవన్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇందులో పవన్ ఏరేంజ్లో తన మార్క చూపిస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
previous post
next post
విషపూరిత స్వభావం కలిగిన వ్యక్తిలో కదలిక… సల్మాన్ పై గాయని సంచలన వ్యాఖ్యలు