telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కులాలను విభజించి పాలించాలనేది వైసీపీ విధానం-జగన్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

*కోనసీమ అల్లర్లకు వైసీపీ ప్లానే ..

*వైసీపీ కూలాలను వీడ‌దీస్తుంది..జ‌న‌సేన కులాల‌ను క‌లుపుతుంది..
*దేశ రాజ‌కీయాల‌న్నీకులాల‌పైనే ఆదార‌ప‌డ్డాయి..
*ఆంధ్రాలో ప్రాంతం క‌న్నా కుల ప్ర‌భావం ఎక్కువ‌..
*తెలంగాణ‌లో కులం క‌న్నా ప్రాంతీయ అభిమానం ఎక్కువ‌..

 జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని మంగళగిలోని పార్టీ ఆఫీసులో నిర్వహించారు. ఈసమావేశంలో మూడు  తీర్మానాలకు ఆమోదం  తెలిపారు.. కోనసీమ అల్లర్లు బహుజన ఐక్యతపై దాడి అని .. ఇది వైఎస్ఆర్‌సీపీ కుట్రేనని పవన్ స్పష్టం చేశారు.  కోనసీమలో శాంతి కమిటీ ఏర్పాటు చేస్తూ జనసేన తీర్మానం తీసిందని ప్రకటించారు.

మంగళగిరిలో మాట్లాడుతూ..కోనసీమ అల్లర్లను కులఘర్షణగా మార్చేందుకు ప్రభుత్వం యత్నించిందన్నారు.  కోన‌సీమ అల్ల‌ర్లు వైసీపీ చాలా ఫ్లాన్డ్‌గా చేశార‌ని అన్నారు. కులాలను విభజించి పాలించాలనేది వైసీపీ విధానమని పవన్ ఆరోపించారు. .

కులరహిత సమాజం ఉండాలని అంబేద్కర్ కల అని తెలిపారు. కులాలు లేని సమాజం అభివృద్ధి చెందుతుందని అంబేద్కర్ అన్నారని గుర్తుచేశారు.

భారతదేశం కులాలతో ముడిపడి ఉందన్నారు. కుల విద్వేషణ చేసిన నేల ఇదని దుయ్యబట్టారు. మనకు ఆంధ్ర అనే భావన లేదని, కులం అనే భావనే ఉందని తప్పుబట్టారు. పక్క రాష్ట్రంలో కులం కంటే తెలంగాణ అనే భావనే ఉందని తెలిపారు.

ఏ ప్రాంతంలోనైనా కొన్ని గొడవలు వుంటాయని.. విజయవాడలో గతంలో జరిగిన ఘటనల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ రెండు కులాల మధ్య చిచ్చు రేపిందని ఆయన గుర్తుచేశారు

అన్ని కులాలవాళ్లు ఓట్లు వేస్తేనే వైఎస్ఆర్‌సీపీ గెలిచిందన్నారు. ఆ సంగతి మర్చిపోయి దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. కోనసీమలో చిచ్చు అంబేద్కర్ పేరుతో వచ్చింది కాదని, అది వైసీపీలోని రెండు వర్గాల మధ్య చిచ్చు అని ఆరోపించారు.

ఉద్రిక్తతలకు అవకాశం ఉందని నిఘావర్గాలకు తెలియదా అని ప్రశ్నించారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ కూడా రాష్ట్రాన్ని హెచ్చరించిందని పవన్‌ కల్యాణ్ తెలిపారు.

మనదేశంలో అవినీతి అనేది రాజకీయాల్లో సహజంగా మారిందని..అవినీతి సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చిన వారు ఏసీబీని కంట్రోల్ చేస్తున్నారని ..ఇది దురదృష్టకరమన్నారు.

ఇసుక అక్రమాలపై ఏ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆయన ప్రశ్నించారు. మద్యంపై ఫిర్యాదు చేయాలంటే జగన్‌పైనే చేయాలంటూ పవన్ చురకలు వేశారు. మనం నిజాయితీగా వున్నా.. అవినీతి, దాడులు చేసే వారి పాలనలో బతకడం ఇబ్బందిగా వుందంటూ జనసేనాని వ్యాఖ్యానించారు.

Related posts