telugu navyamedia
సినిమా వార్తలు

పవన్‌ భీమ్లానాయక్ 21న‌ ప్రీరిలీజ్ ఈవెంట్‌: ముఖ్య అతిథిలుగా తెలంగాణ మంత్రులు

పవర్​స్టార్ పవన్‌కళ్యాణ్ న‌టించిన చిత్రం ‘భీమ్లా నాయక్‌. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ద‌గ్గుపాటి మ‌రో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యపనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు స్టార్ దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచారు సినిమా యూనిట్‌ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఫిబ్ర‌వ‌రి 21న గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా  తెలంగాణ మంత్రులు  కేటీఆర్,  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరుకానున్నారు.

ఈ మేరకు సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ రెండు పోస్టర్లను విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది.

తమ విన్నపాన్ని మన్నించి ప్రీరిలీజ్‌ వేడుకకు వస్తానని చెప్పిన మంత్రి కేటీఆర్‌కు నిర్మాత నాగవంశీ ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రీరిలీజ్‌ వేడుకకు కేటీఆర్‌ హాజరవుతుండటం వల్ల ‘భీమ్లా నాయక్‌స ఈవెంట్‌ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మ‌రోప‌క్క‌ ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో అభిమానులలో ఆస‌క్తిపెరిగిపోతుంది.

Related posts