telugu navyamedia
సినిమా వార్తలు

‘భీమ్లా నాయక్’ ఎఫెక్ట్‌ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా వాయిదా..

యంగ్ హీరో శర్వానంద్, రష్మికా మందన్నా జంటగా నటించిన‌ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా మార్చి 4వ తేదీకి వాయిదా పడింది. తొలుత ఈ నెల 25న విడుదల చేయాలని అనుకున్నారు.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీ ఈ నెల 25న జనం ముందుకు వస్తుండటంతో ఆ రోజున విడుదల కావాల్సిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ వాయిదా పడుతుంది.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన సినిమా టైటిల్‌ ట్రాక్ , పోస్ట‌ర్స్‌.. అలాగే వేలంటైన్స్ డే కానుక‌గా రిలీజ్ చేసిన ఓ ఆధ్య పాట‌కు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌ క‌లిసి న‌టిస్తుండ‌డం ఈ సినిమాలో మ‌రో విశేషం.

Related posts