జనసేన అధినేత పవన్కల్యాణ్పై విమర్శలు చేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని, తనని తిడుతూ గత 24 గంటల్లో కొన్ని వేల ఫోన్ కాల్స్, మెస్సేజ్లు వచ్చాయని సినీ నటుడు, వైకాపా కార్యకర్త పోసాని కృష్ణమురళి మంగళవారం సాయంత్రం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా పవన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్కల్యాణ్.. నీ సైకో ఫ్యాన్స్కు ఏం చెప్పుకుంటావో చెప్పుకో అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
ఈక్రమంలో..పోసాని ప్రెస్క్లబ్ ముగిసిన తరువాత బయటకు వచ్చిన పోసాని.. కొన్ని ఛానల్స్ ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకి ప్రాణ హాని ఉందని.. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్.. అతని సైకో ఫ్యాన్స్ ద్వారా నన్ను కొట్టించాలని చంపించాలని చూస్తున్నాడు. ఈరోజు కాకపోతే రేపైనా చనిపోవాల్సిందే.. అందుకే నా ప్రాణ రక్షణ కోసం నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయబోతున్నా. అతను దుర్మార్గుడో అన్ని బయటపెట్టబోతున్నా.. అని చెప్తుండగా.. ప్రెస్క్లడ్ గోడదూకి కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా పోసాని మీదికి దూసుకుని వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
పోసానికి వ్యతిరేకంగా పవన్ అభిమానులు నినాదాలు చేశారు. తమ అభిమాన నాయకుడిపై పర్సనల్ అటాక్ చేస్తే ఊరుకునేది లేదంటూ.. హైదరాబాద్లో పోసానికి తిరగనివ్వం అంటూ హెచ్చరించారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అరెస్టు చేసిన ఆందోళనకారులను పంజాగుట్ట పోలీస్స్టేషన్కు తరలించారు. పోసానిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లిన పోలీసులు.. అనంతరం పోలీసు వాహనంలోనే ఆయన ఇంటికి తరలించారు.