పవర్స్టార్ పవన్కల్యాణ్.. తన మాజీ భార్య రేణుదేశాయ్తో కలిసి మొదటిసారి ఒకే ఫ్రేమ్లో కనిపించారు. పవన్, రేణు దేశాయ్ విడాకులు తర్వాత ఇద్దరు పిల్లలూ రేణు దగ్గరే ఉంటున్నారు.
అయితే, పవన్ కళ్యాణ్ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి బాబోగులు చూసుకుంటూ ఉంటారు..అప్పుడప్పుడు పవన్ తన పిల్లలని కలుస్తూ ఉంటాడు, తనతో పాటు మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి తీసుకెళ్తూ ఉంటాడు. ఇలా పిల్లల కోసం మాత్రం పవన్ వస్తాడు.
అయితే విడాకుల తర్వాత పవన్ పెద్దగా రేణు ఇంటికి వెళ్లింది లేదు. ఎక్కడా రేణు దేశాయ్ను కలిసింది లేదు.
తాజాగా పవన్, రేణు దేశాయ్ల కుమారుడు అకీరా నందన్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో తన స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో స్కూల్లో జరిగిన వేడుకలకు రేణు దేశాయ్ తన కూతురు ఆద్యతో కలిసి రాగా.. పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.
అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నేపథ్యంలో పవన్, రేణు దేశాయ్, కూతురుతో కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటోను రేణు దేశాయ్ తన ఇన్స్టాలో చేస్తూ.. ఎమోషనల్ అయ్యారు.
ఒక శకం ముగుస్తుంది మరో శకం ప్రారంభం అవుతుంది. ఒక అద్భుతమైన అబ్బాయి గ్రాడ్యుయేషన్ రోజున .. అతని తల్లిదండ్రులు గర్వపడుతున్నారు. ఇక ఉదయాన్నే లేచీ స్కూల్కు వెళ్లాల్సిన అవసరం లేదు. బస్సు టైమింగ్ గురించి టెన్షన్ కూడా అవసరం లేదు. లంచ్ బాక్స్ త్వరగా సిద్ధం చేయాలని తొందరపడాల్సిన పని లేదు. ట్యూషన్లు లేవు, పేటీఎం లేదు, స్కూల్ లేదు… అతని నిజమైన ప్రయాణం ఇప్పుడు మొదలవుతుందని నేను అకిరాతో చెప్పాను, ఇక అతనికి తన తల్లిదండ్రులు దారి చూపించాల్సిన అవసరం లేకుండా అతడే సూర్యకాంతిలో తనదైన స్థానాన్ని కనుగొంటాడని నేను ఆశిస్తున్నాను. నా చిన్న అకీరా చాలా వేగంగా పెద్దోడయిపోయాడు’ అంటూ రేణు దేశాయ్ పోస్టు చేశారు. నిమిషాల వ్యవధిలోనే అది వైరల్గా మారిపోయింది.
రామ్ గోపాల్ వర్మనే పెళ్లిచేసుకునేదాన్ని కానీ : గాయత్రీ గుప్త