ఉత్తరాంధ్ర వైసీపీ నేతలపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు విశాఖను వీసా పట్టణంగా మార్చేశారని దుయ్యబట్టారు. సీఎం జగన్ విశాఖను రౌడీషీటర్లకు నిలయంగా మార్చారని విమర్శించారు. దందాలతో ప్రజల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రను కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనకాపల్లిలో ఓ రౌడీ ముఠా ప్రతివారం వనభోజనాలు పెడుతోందని ఆమె అన్నారు. అవి పైకి వనభోజనాలే అయినా, లోపల భూదందాలు జరుగుతుంటాయని వెల్లడించారు. వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర ద్రోహులని విమర్శించారు. వైసీపీ పాలనలో పులివెందుల దొంగలు ఉత్తరాంధ్రను దోపిడీ చేశారని మండిపడ్డారు. వైసీపీ అవినీతికి ఏదీ అనర్హం కాదని చెప్పారు. గంజాయి అమ్ముతున్నారని, నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నారని ఆరోపించారు.
రెడ్లలో జగన్ను గెలిపించుకోవాలన్న పట్టుదల: ఎంపీ జేసీ