telugu navyamedia
రాజకీయ వార్తలు

మోదీని శాలువాతో సత్కరించిన కేసీఆర్‌

KCR's dream Will Change or come true

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా మోదీకి పుష్పగుచ్ఛం అందజేసి, ఆయన్ని శాలువాతో కేసీఆర్ సత్కరించారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి నిధులు ఇవ్వాలని మోడీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కోరారు.

ఆర్థిక మాంద్యం దృష్ట్యా రాష్ట్రానికి గ్రాంట్లు, కేంద్రం వాటా నిధులు యథాతథంగా ఇవ్వాలని కేసీఆర్ కోరారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ కర్మాగారం , బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని మోదీని కేసీఆర్‌ కోరారు. వెనుకబడిన జిల్లాలకు, కేంద్ర సౌజన్య పథకాలకు నిధులు ఇవ్వాలని, జోనల్‌ విధానంలో కొత్త జిల్లాలకు చోటు కల్పించాలని సీఎం, ప్రధానికి విజ్ఞప్తి చేశారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ప్రాజెక్టులకు సాయం అందించాలని మోడీని కేసీఆర్ కోరారు.

Related posts