బుల్లితెరపై హోస్ట్ గా ఓంకార్ మంచి గుర్తింపును దక్కించుకున్నారు. విశేష ప్రేక్షకాదరణ పొందిన ఓంకార్ ఆ తరువాత “రాజుగారి గది” చిత్రంతో దర్శకుడిగా మరి హిట్ అందుకున్నారు. బుల్లితెరపై పలు షోస్తో ఆదరణ దక్కించుకున్న ఓంకార్ తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం “రాజుగారి గది`. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఈ సినిమాకు సీక్వెల్ గా “రాజుగారి గది-2” చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాగార్జున, సమంత కీలకపాత్రల్లో నటించారు. తాజాగా “రాజుగారి గది-3” అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా… రెండో చిత్రంలో “కింగ్” నాగార్జున, సమంత కూడా నటించారు. తాజాగా ఈరోజు (శుక్రవారం) మూడో సినిమా విడుదలైంది. ఈ సిరీస్లో మరిన్ని చిత్రాలు వస్తాయని, ఎప్పటికైనా వెంకటేష్గారితో ఈ సిరీస్లో ఒక చిత్రం చేస్తానని ఓంకార్ వెల్లడించారు. “నిజానికి ‘రాజుగారిగది-2’ చిత్రాన్ని వెంకటేష్గారితోనే ప్లాన్ చేశాను. కానీ, కొన్ని కారణాల వల్ల నాగార్జునగారితో చేయాల్సి వచ్చింది. ఎప్పటికైనా ఈ సిరీస్లో వెంకటేష్గారితో ఒక సినిమా చేస్తాను. అయితే అది ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేను” అని ఓంకార్ చెప్పారు. మరి హారర్ కామెడీ టైపు చిత్రాన్ని చేయడానికి వెంకటేష్ ఒప్పుకుంటారో లేదో చూడాలి.
previous post
next post
ఆ సినిమాలు చేయను… దర్శకులకు నచ్చకపోవచ్చు : రష్మిక