కొరటాల శివ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న చిత్రం ఆచార్య. ‘ఆచార్య’ షూటింగ్ పూర్తి అయిన వెంటనే చిరంజీవి తన తర్వాతి సినిమాను మొదలు పెట్టబోతున్నారట. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ రీమేక్కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కలకత్తా నేపథ్యాన్ని కథలో యాడ్ చేస్తున్నారట. ఇక 2015లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతారని తీసుకునేలా చర్చలు జరుగుతున్నాయట. కానీ ఈ సారి మెగాస్టార్కు జోడిగా కాకుండా ఆయనకు గట్టిపోటీ ఇచ్చే సిస్టర్ పాత్ర కోసం అనుకుంటున్నట్లు టాక్. ఒరిజినల్ వైర్షన్ మలయాళంలో మంజు వారియర్ పోషించిన పాత్రకి నయనతార అయితే… ఇంపాక్ట్ చాలా బాగుంటుందని ఫిక్స్ అయ్యారట. సైరాలో భార్య, భర్తల్లా కనిపించిన చిరు-నయన్… లూసిఫర్లో మాత్రం అన్న-చెలెల్లిగా కనిపించనున్నారు. అయితే… దీనిపై త్వరంలోనే క్లారిటీ రానుంది.
previous post
next post