తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పేరా రామచంద్రాపురంలోని ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో ఉన్న ఆయిల్ అంతా మంటల్లో కాలిపోయింది. ఆయిల్ ప్యాక్టరీలో ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు.
జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పే పనిలో పడ్డాయి. ఇటీవల ఈ ఫ్యాక్టరీని ఆధునికీకరించారు. సంబంధిత పనులు పూర్తయిన తర్వాత.. నాలుగు రోజుల క్రితమే నూనె శుద్ధి పనులను తిరిగి ప్రారంభించారు. ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకున్న ఆయిల్ ను ఈ ప్యాక్టరీలో శుద్ధిచేస్తారు. అయితే ప్రమాదానికి గల కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.