telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

త్వరలో ఇటలీకి “రంగ్ దే” టీం ప్రయాణం

Rangde

యంగ్ హీరో నితిన్ ఇటీవల ‘భీష్మ’ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా పట్టాలెక్కించాడు నితిన్. ‘మహానటి’ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘రంగ్ దే’ ఫస్ట్ లుక్ మరియు నితిన్ మ్యారేజ్ నాడు రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోకి మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలనీ నిర్మాతలు భావిస్తున్నారని గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు థియేటర్స్ కు అనుమతి లభించడంతో రంగ్ డే సినిమాను కూడా థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. ఇక కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ బ్యాలెన్స్ ‘రంగ్ దే’ ఇటీవలే హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైంది. ఈ షూట్ పూర్తయిన తరువాత మూవీ టీమ్ ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేసారని తెలుస్తోంది. ఇందుకోసం చిత్రయూనిట్ ఇటలీకి వెళ్లనుందని సమాచారం.ఇటలీ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలు కూడా చిత్రీకరించనున్నారు. అందుకు అక్టోబర్ చివరి వారంలో ఇటలీ పయనమవుతారని తెలుస్తోంది.

Related posts