డేనియల్ క్రెయిగ్ ప్రధాన పాత్రలో ‘”జేమ్స్ బాండ్” 25వ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘నో టైమ్ టు డై’ అనే పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. అయితే ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావం కారణంగా వాయిదా పడింది. గతంలో కరోనా పరిస్థితుల దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాని ఏడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా దెబ్బకు వాయిదా పడింది. ఆ తర్వాత నవంబర్ 12 యుకేలో, నవంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయాలనీ భావించారు. కానీ ఈసారి కూడా’నో టైమ్ టు డై’ సినిమా వాయిదా పడక తప్పలేదు. ఇప్పుడు 2021 కి వాయిదా వేశారు.ఆలస్యం మా అభిమానులకు నిరాశ కలిగించిందని మేము అర్థం చేసుకున్నాము. కాని ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా తప్పడం లేదు’ అని మూవీ యూనిట్ పేర్కొంది. మోట్రో గోల్డెన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కారీ జోజి ఫుకునాగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అపహరణకు గురైన ఓ శాస్త్రవేత్తను కాపాడేందుకు మళ్లీ బాండ్ను విధుల్లోకి తీసుకొస్తారని, దీని ఆధారంగానే ఈ చిత్ర కథ ఉండబోతోందని సమాచారం.
previous post
next post