telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

‘నిర్భయ’దోషుల స్టేపై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ!

man ordered to plantation by delhi court

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పుపై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. దోషుల క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్లు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉండడం వల్ల ఉరిశిక్ష అమలుపై పాటియాలా హౌస్‌కోర్టు గత నెల 31న స్టే విధించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కారు రెండూ ఈ స్టేను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించాయి.

కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై శని, ఆదివారాల్లో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 2న తీర్పును రిజర్వు చేసింది. నేడు తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తం మరోమారు కోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దోషుల ఉరిశిక్ష అమలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఎటువంటి తీర్పు వస్తుందో వేచిచూడాలి.

Related posts