telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రజలకు లబ్ధి చూకూర్చే చట్టాలు రూపొందించాం: మోదీ

narendra-modi

ప్రజలకు లబ్ధి చూకూర్చే అనేక చట్టాలు రూపొందించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్రంలో రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తోన్న సందర్భంగా దేశ పౌరులకు బహిరంగ లేఖ రాశారు. ఏడాది క్రితం ఇదే రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలైందని ఆయన చెప్పారు.

తమ పాలనలో కోట్లాది మందికి ఉచిత గ్యాస్‌తో పాటు విద్యుత్ కనెక్షన్లు అందించామని, దేశంలో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించామని చెప్పారు. దేశాన్ని ప్రపంచ నాయకత్వ స్థానంలో చూడాలన్నదే దేశ ప్రజల కల అని ఆయన చెప్పారు. అందరితో కలిసి అందరి వికాసం కోసం మంత్రం నినాదం ఇచ్చిన ఉత్సాహంతో భారత్ అన్ని రంగాలలో ముందడుగు వేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.

ఆర్టికల్ 370ని రద్దు చేయడం దేశ సమైక్యతను పెంచిందన్నారు. రామమందిరంపై సుప్రీంకోర్టు తీర్పు శతాబ్దాలకాలంగా సాగుతున్న చర్చకు మంచి ముగింపునిచ్చిందని చెప్పారు. ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేశామని, పౌరసత్వ చట్టానికి సవరణ చేశామని చెప్పారు. తమ పాలనలో త్రివిధ దళాల అధిపతి కోసం కొత్త పదవిని సృష్టించామని తెలిపారు.

Related posts