telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ లో నవదీప్… మొదటి ఛాన్స్ సన్నీతో…!

Navadeep

తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ప‌లు చిత్రాలు చేశాడు యంగ్ హీరో న‌వ‌దీప్. అంతేకాదు అనేక టీవీ షోలకు వ్యాఖ్యాతగా కూడా ఉన్నాడు. 2004లో వ‌చ్చిన “జై” సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన హీరో న‌వ‌దీప్‌ ఇప్పుడు కేవ‌లం స‌పోర్టింగ్ క్యారెక్టర్స్ మాత్ర‌మే చేస్తున్నాడు. ప్రస్తుతం న‌వ‌దీప్ అల్లు అర్జున్ 19వ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల ఆయ‌న సిక్స్ ప్యాక్ లుక్ సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొద్ది రోజులుగా గంట‌ల‌పాటు జిమ్‌లో శ్ర‌మించిన న‌వ‌దీప్ కండ‌లు తిరిగిన దేహంతో బాలీవుడ్ హీరో లుక్‌లో కన్పించి నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు నవదీప్. మరో పక్క బాలీవుడ్‌లో తొలి అవకాశంలోనే హాట్ నటి సన్నీ లియోనీతో కలిసి పని చేయబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏఎల్‌టీ బాలాజీ హిందీలో “రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్” అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇందులో నవదీప్‌, సన్నీ లియోనీ కలిసి పనిచేయబోతున్నారు. ఈ సందర్భంగా సెట్‌లో వీరిద్దరూ కలిసి సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీని సన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. “నవదీప్‌తో కలిసి పనిచేయబోతున్నాను. ఇలాంటి మంచి వ్యక్తితో కలిసి పనిచేయబోతున్నందుకు సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు నవదీప్ రిప్లై ఇస్తూ.. “మై ప్లెజర్ సన్నీ. యూ ఆర్ సో ఫన్నీ” అని క్యాప్షన్ ఇచ్చాడు. “రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్” ఓ ఎరాటిక్ హారర్ సిరీస్. 2014లో “రాగిని ఎంఎంఎస్ 2” టైటిల్‌తో ఓ హారర్ సినిమా విడుదలైంది. ఇందులో సన్నీ లియోనీ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఇప్పుడు ఇదే టైటిల్‌తో వెబ్ సిరీస్‌ నిర్మించాలని నిర్మాత ఏక్తా కపూర్ భావిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యేలా దక్షిణాది నుంచి నవదీప్‌ను ఎంచుకున్నారు. మరోపక్క నవదీప్… “అల వైకుంఠపురంలో” చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. అల్లు అర్జున్, పూజా హెగ్దే ఇందులో జంటగా నటిస్తున్నారు.

Related posts