చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల ప్రేమ పెళ్లిళ్లు..ఆ తరువాత విడాకులు అనేది ఫ్యాషన్ అయిపోయింది. టాలీవుడ్లో ఇప్పటికే స్టార్ జంట సమంత, నాగచైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్ బ్యూటీఫుల్ కపూల్ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు తీసుకున్నారు.
తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోమవారం రాత్రి 11 గంటలగంటల సమయంలో ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ తాము విడాకులు తీసుకున్నట్లుగా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలియజేశారు.
దీంతో అటు రజినీ కాంత్, ధనుష్ అభిమానులు షాకయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట డైవర్స్ ప్రకటన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ధనుష్, ఐశ్వర్య రజనీ కాంత్లకు సంబంధించిన జ్ఞాపకాలను షేర్ చేస్తూ గుండె పగిలిందంటూ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తున్నారు.ఈ వీడియోలో ధనూష్ – ఐశ్వర్య కోసం పాడిన పాట ఎంతో అద్భుతంగా ఉందని తెలుపుతున్నారు.
This one 💔 #Dhanush #Aishwarya pic.twitter.com/c8FDeuzqyL
— VCD (@VCDtweets) January 17, 2022
2004, నవంబరు 18న వీరిద్దరి వివాహం జరిగింది. అప్పటికి ధనుష్ వయసు 21ఏళ్లు మాత్రమే. ధనుష్ కంటే ఐశ్వర్య రెండేళ్లు పెద్ద. ప్రేమకి వయసుతో సంబంధం లేదని నిరూపించుకున్నారు. ఎంతో అన్యోన్యంగా మెలిగిన ఈ జంట ప్రేమకి గుర్తుగా ఇద్దరు కుమారులు యాత్ర రాజా, లింగ రాజా జన్మించారు. ప్రస్తుతం యాత్ర రాజా వయసు 15 సంవత్సరాలు కాగా, లింగ రాజా వయసు 11 సంవత్సరాలు. ఇలాంటి టైమ్లో వీరిద్దరు డైవర్స్ ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
They both be in a lot more pain then we are 💔#Dhanush #Aishwarya pic.twitter.com/hyvKMs4BOT
— Vignesh STR™ (@itsvignesh_) January 17, 2022
Shocking 🥺🥺
💔💔
Dhanush & Aiswarya divorce #Dhanush #aishwarya #Rajinikanth #divorce #tamilcinema pic.twitter.com/3Tb8dp082B— Salam Mass (@SALAMMASS1) January 17, 2022
టాప్ లెస్ ఫోజు మీకు నచ్చిందా… కొత్తగా ఉంటుందని ట్రై చేశా…